నేడు విద్యుత్ సరఫరా ఉండని ప్రాంతాలు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), మే 23: హెచ్ఎంటి విద్యుత్ సబ్ స్టేషన్ 11 కెవి వెంకన్న హిల్స్ ఫీడర్ పరిధిలోని మరమ్మత్తుల కారణంగా శుక్రవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తున్నట్లు ఏఈ రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు వెంకటేశ్వర నగర్, సిపిఆర్ కాలనీ, వెంకన్న హిల్స్, న్యూ వివేకానంద నగర్, మోడీ అపార్ట్మెంట్స్, బోలా శంకర్ నగర్, ప్రశాంత్ నగర్ ప్రాంతాలతో విద్యుత్ సరఫరా ఉండదని ఆయన పేర్కొన్నారు.
అలాగే 11 కెవి మాణిక్య నగర్ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:30 గంటల వరకు వాణి నగర్, ఇంద్ర సింగ్ నగర్, కంచన్ వాలా మెయిన్ రోడ్డు, సుదర్శన్ రెడ్డి నగర్, ఆగ్రోస్ , మహేంద్ర నగర్, కాకతీయ నగర్, వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు ఏఈ తెలిపారు.