మదర్ తెరిసా పాఠశాలలో ఘనంగా సైన్స్ ఫెయిర్

కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), ఫిబ్రవరి 28: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా మదర్ తెరిసా పాఠశాలలో సైన్స్ ఫెయిర్ ను శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచన, భారతీయ సంస్కృతిపై అవగాహనను ప్రదర్శించే గ్రాండ్ సైన్స్ ఫెయిర్ అండ్ కల్చరల్ ఎగ్జిబిషన్‌ను విజయవంతంగా ప్రదర్శించారు. విద్యార్థులు రూపొందించిన వినూత్న ప్రయోగాలు, శాస్త్రీయ నమూనాలు, ప్రాజెక్టులు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం శాస్త్రీయ ఆవిష్కరణలతో కళకళలాడింది. చిన్నారులు సులభమైన శాస్త్రీయ సూత్రాలను ఆకర్షణీయంగా ప్రదర్శిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. పర్యావరణ పరిరక్షణ, పునరుత్పాదక శక్తి, రోబోటిక్స్, వ్యవసాయ సాంకేతికత, ఆరోగ్య పరిరక్షణ వంటి విభిన్న అంశాలపై విద్యార్థులు రూపొందించిన నమూనాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.

సైన్స్ ఫెయిర్ లో నమూనాల పనితీరును వివరిస్తున్న విద్యార్థులు

చంద్రయాన్ ప్రాజెక్ట్ మోడల్ ప్రధాన ఆకర్షణలలో ఒకటి గా నిలిచింది. విద్యార్థులు భారతదేశ అంతరిక్ష లక్ష్యం, జాతీయ అభివృద్ధిలో సైన్స్, ఆవిష్కరణల ప్రాముఖ్యతను వివరించారు.విద్యార్థులు ఆనకట్ట, నీటి నిర్వహణ నమూనాలను కూడా ప్రదర్శించారు, నీటిపారుదల వ్యవస్థలు, నీటి సంరక్షణ, ఆనకట్టల ప్రాముఖ్యతను కూడా వివరించారు. డిఎన్ఏ నిర్మాణం, ధ్వని తరంగాలు, కాంతి ఆధారిత ప్రయోగాలు వంటి సైన్స్ పని తీరును నమూనాల ద్వారా ప్రదర్శించారు. చిన్నారుల ఆత్మవిశ్వాసం, విషయంపై ఉన్న పట్టుదల, వివరణాత్మక సమాధానాలు అక్కడికి వచ్చిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అతిథులను మెప్పించాయి.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. సాయికుమార్ మాట్లాడుతూ…సైన్స్ అనేది కేవలం పుస్తకాల పరిమితి కాదని, ఆలోచించే విధానమే అని పేర్కొన్నారు. విద్యార్థుల్లో పరిశోధనాత్మక దృక్పథం పెంపొందించడమే ఈ సైన్స్ ఫెయిర్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ సైన్స్ ఫెయిర్ ద్వారా విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రదర్శించడంతో పాటు ప్రయోగాలపై మరింత ఆసక్తి పెంపొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు అశోక్ యాదవ్, శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More