క్యాబినెట్ నిర్ణయాలపై వెంటనే ఉత్తర్వులు ఇవ్వండి
హైదరాబాద్ (న్యూస్ విధాత్రి), జూన్ 11: ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘ కాలిక సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని క్యాబినెట్ సబ్ కమిటీ, అధికారుల సబ్ కమిటీలను నియమించారు. దీంతో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించినందుకుగాను టీజీఈజెఎసి ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావును మర్యాదపూర్వకంగా బుధవారం కలిసి తెలంగాణా ఉద్యోగుల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగులకు సంబంధించి క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయాలపై ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు.
ఈ కార్యక్రమములో టీజీవో ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రామారావు, సంధ్య, లక్ష్మణ్ గౌడ్ , మోహన్, శ్రీరామ్ రెడ్డి, షౌకత్, శ్రీరామ్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.